జగన్‌కు కనబడటం లేదా..?

జగన్‌కు ఏపీలో చేస్తున్న అభివృద్ధి కనబడటం లేదా..? అని మంత్రి దేవినేని ఫైరయ్యారు. అప్పుల ఊబిలో కూరుకున్న ఏపీని అభికృద్ధి చేసేందుకు సీఎం నానా తంటాలు పడితే.. జగన్‌కు నవ్వులాటగా ఉందా.. అని ప్రశ్నించారు. అసలు జగన్‌కు పోలవరంపై ఆరోపణలు చేసే అర్హతే లేదు అని అన్నారు. పోలవరం ప్రాజెక్టు అడ్డుకునేందుకు కేంద్రం కేసులు వేస్తుంటే అడ్డుకోవాల్సింది పోయి.. ఇంకా రెచ్చకొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాల్లో పాదయాత్ర చేస్తున్న జగన్‌కు ఏపీలో జరిగిన అభివృద్ధి కనిపించడం లేదా అని వాఖ్యానించారు. తనకు మద్దతు రావాలనే.. ప్రభుత్వంపై బురద చల్లే చర్యలు చేపడుతున్నారన్నారు.

అసెంబ్లీ ఎగ్గొట్టి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్న జగన్‌.. రాష్ట్రంలోని సమస్యల గురించి అడగడం విడ్డూరమన్నారు. టీడీపీ ఎంపీలు ఏపీ విభజన హామీలకై నిరసన చేస్తుంటే మద్దతు తెలపాల్సింది పోయి.. వాళ్ల ఎంపీల చేత కామెంట్స్‌ చేయిండం సిగ్గుమాలిన చర్య అన్నారు. ఏపీ కోసం ఒకటిగా కలిసి ముందుగా వెళ్లాలి కాని.. బీజేపీకి సహాయం చేయడమేంటన్నారు. తెలంగాణాలో టీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తే ఏపీలో బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారన్నారని మంత్రి దేవినేని అన్నారు.

leave a reply