ఆకస్మిక తనిఖీలు.. 2 కోట్లు స్వాధీనం..!

సత్తుపల్లిలో అక్రమంగా  తరలిస్తున్న నగదు, మద్యం సీసాలు స్వాధీనం 

తెలంగాణ ఎన్నికల సందర్భంగా కాజీపేటలో  పోలీసులు  తనిఖీలు  జరపగా  పెద్దమొత్తంలో నగదు పట్టుబడింది. పోలీసుల కథనం ప్రకారం వరంగల్  జిల్లా  కాజీపేటలో అధికారులు ఆకస్మికంగా తనిఖీలు  జరపి రూ. 2 కోట్లు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఫాతిమానగర్  గోపాల్ రావు అనే వ్యక్తి ఇంట్లో ఈ నగదును గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.తెలంగానాలో ఎన్నికల సందర్భంగా అధికారులు  అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు అటు జగిత్యాల జిల్లా మంచిర్యాలలోని ఓ షాపింగ్మల్లో పంచడానికి సిద్ధంగాఉన్న2000 చీరలను,ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అక్రమంగా  తరలిస్తున్న 210 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

leave a reply