లా విద్యార్థిని.. బలవన్మరణం!

తిరుపతి:లా చదువుతున్నా విద్యార్థిని ఆత్మహత్య. తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కడప జిల్లాకు చెందిన సుస్మిత పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ నాలుగో సంవత్సరం చదువుతున్నారు. ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఉంటున్న ఆమె తోటి విద్యార్థినులు లేని సమయంలో గదిలోని ఫ్యాన్ కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. అదే సమయంలో హాస్టల్ లో ఎవరు గమనించక పోవడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుస్మిత మరణానికి గల కారణాలను పోలీసులు అరాతీస్తున్నారు. అయితే సంఘటన స్థలాన్ని బట్టి సుస్మిత సరిగా కాలేజీకి హాజరు కావట్లేదు అని ఆమె మరణానికి ప్రేమ వ్యవహారమే అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పోలీసులు వివరాలను సేకరించి తరువాత మృతదేహాన్ని రుయా ఆసుపత్రికి తరలించారు.

leave a reply