బోల్తా పడ్డ బస్సు..

ఈ మధ్య అయ్యప్ప భక్తుల గురించి ఏదో ఒక సంఘటన వెలుగులోకి వస్తూనే ఉంది తాజాగా…చిత్తూరు జిల్లా మదనపల్లె వద్ద శుక్రవారం తెల్లవారుజామున అయ్యప్ప భక్తుల బస్సు రోడ్డు ప్రమాదానికి గురి అయినది. మదనపల్లె బైపాస్‌రోడ్డు వద్ద అయ్యప్ప భక్తుల బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 15 మంది అయ్యప్ప భక్తులకు గాయాలయ్యాయని సమాచారం. అయితే ఈ ప్రమాదం శబరిమల నుంచి తిరిగివస్తుండగా జరిగిందని తెలుస్తుంది. క్షతగాత్రులను మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భాధితులది అనంతపురం జిల్లా ఓబులదేవరచెరువు మండలం దాదిరెడ్డిపల్లిగా గుర్తించారు. మృతున్ని తిరుపాల్‌రెడ్డిగా(45)గా గుర్తించారు.

ప్రమాదానికి సంబంధించి 41 మంది అయ్యప్ప భక్తులు ఈ నెల 25న శబరిమలకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మదనపల్లె పట్టణ సరిహద్దు బైపాస్‌రోడ్డులోని ఆర్టీవో కార్యాలయం వద్ద ముందు వెళ్తున్నలారీని ఓవర్‌టెక్‌ చేయబోయి వీరు ప్రయాణం చేస్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. అయితే క్షతగాత్రుల్లో చంద్ర, లావణ్యమ్మ, రామానుజులమ్మ, సాలెమ్మలకు తీవ్ర గాయాలవడం వలన వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.

leave a reply