ఆంధ్రప్రదేశ్లో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతూ కొలువుదీరిన కొత్త హైకోర్టులో అధికారిక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10గంటలకే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ సహా న్యాయమూర్తులు విధులకు హాజరయ్యారు. విజయవాడ కేంద్రంగా ఉన్న గవర్నర్ పేటలో కోర్టు వ్యవహారాల కోసం తాత్కాలిక భవనం కేటాయించడంతో ఉదయం నుంచి న్యాయమూర్తులు, న్యాయవాదులతో ఆ ప్రాంతం రద్దీగా మారింది. చీఫ్ జస్టిస్ బెంచ్ మీదకు 42 కేసులు విచారణకు రానున్నాయి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వేసిన రిట్ అప్పీల్ను తొలి కేసుగా సీజే జస్టిస్ ప్రవీణ్ కుమార్ విచారించనున్నారు.