మణికర్ణిక విడుదలై చాలా రోజులైనా విమర్శలు జోరు తగ్గడం లేదు. ఈ చిత్రం మధ్యలో విభేదాలతో తప్పుకున్న క్రిష్ఫై నిర్మాత విమర్శలు చేసాడు. తమ సినిమా ‘మణికర్ణిక’కు నష్టం కల్గిస్తున్నారని నిర్మాత కమల్ జైన్ అభిప్రాయపడ్డారు.”మణికర్ణిక” సినిమా సగానికిపైగా షూటింగ్ తనే చేశానని ఇటీవల కంగన అన్న మాటలపై క్రిష్ తనదైన రీతిలో విమర్శించాడు. కంగన తన పాత్రను ఎలివేట్ చేసుకోడానికి మిగిలిన నటీనటుల పాత్రల్ని కట్ చేశారని క్రిష్ ఆరోపించాడు. దీనిపై పలువురు స్పందించగా, ఈ సినిమా నిర్మాత తాజాగా మీడియా సమావేశంలో నటి కంగనా రనౌత్కు తన మద్దతు తెలిపాడు.
ఈ చిత్ర నిర్మాత కమల్ జైన్ మాట్లాడుతూ… క్రిష్ ఈ చిత్రానికి చేయని పనికి కూడా మొత్తం క్రెడిట్ తనకే కావలనడం బాగాలేదన్నారు. మొదటి నుంచి చిత్రం పూర్తి అయ్యే వరకు కష్టపడ్డ కంగనను విమర్శించడం బాధాకరమన్నారు. కంగన తీసుకున్న ప్రతి నిర్ణయం.. ప్రొడక్షన్ టీంను సంప్రదించే తీసుకున్నారు. ఈ చిత్రం విమార్సుకుల ప్రశంసలు అందుకుని, బాక్సాఫీసు వద్ద ఘాన విజయం అందుకున్న తర్వాత క్రిష్ మాట్లాడటం సరికాదన్నారు. ఆయనకు నిజంగానే నష్టం కలిగి ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ వివాదం గురించి ఈ చిత్రానికి కథ అందించిన ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్పందించారు. ‘మణికర్ణిక’ చిత్రం తన సినీ కెరీర్లో ఎంతో ముఖ్యమైనదని, దీనిపై వివాదాలు రావడం తనకు సంతోషంగా లేదని అయన తెలిపారు. అంతేకాకుండా ఈ వివాదం ఇక్కడితో ఆగితే మంచిదని, సినిమా చక్కగా ఆడాలని ఆశిస్తున్నానన్నారు. ఈ చిత్రం కోసం క్రిష్, కంగన ఇద్దరూ కష్టపడ్డారని ఎవరిని తక్కువ చేయలేమని ఆయన చెప్పారు.