ఘోర రోడ్డు ప్రమాదం….

తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాలలోకి వెళ్తే గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం కర్నూలు-గుంటూరు జాతీయ రహదారిపై పాతులూరు వద్ద బుధవారం వేకువజామున  గుర్తు తెలియని వాహనం ఢీకొని ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. తెల్లవారుజామున అయినందువల్ల మంచు ఎక్కువగా ఉండటంతో అటుగా వెళ్లే వాహనాలకు  చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు కనిపించక పోవడంతో వాటిపై నుంచి తొక్కుకుంటూ వెళ్లాయి.

మృతుల వివరాలకొస్తే.. ఫిరంగిపురం మండలం తాళ్లూరుకు చెందిన దీనబాబు(19), జానయ్య(18) మరో వ్యక్తితో కలసి ద్విచక్రవాహనంపై పొనుగుపాడు నుంచి ఫిరంగిపురం వస్తున్నారు. వీరు జాతీయ రహదారిపైకి చేరుకోగానే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో వారి వాహనం రోడ్డుపై ఈడ్చుకుపోవడంతో మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది.కాగా  ప్రమాదంలో మృతిచెందిన మూడో వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న నాదెండ్ల ఎస్సై పి.రామాంజనేయులు మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం చిలకలూరి పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.

leave a reply