ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు సైబరాబాద్ నిర్మిస్తే.. సైబర్క్రైమ్ చేస్తోంది జగన్ అని తీవ్ర విరమ్శలు చేసారు. టెన్త్ పరీక్షాపత్రాలు ఎత్తుకెళ్లింది జగన్ కాదా? అని నిలదీశారు. ఇప్పుడు తెదేపా డేటాను తెరాస తో కలసి చోరీ చేస్తున్నారని ఆరోపించారు.నేరాలు-ఘోరాలు, చోరీల్లో జగన్కు ఎవరు సాటి లేరు అని ఎద్దేవా చేసారు.
మరో వైపు తెదేపా డేటాను తెలంగాణ ప్రభుత్వం చోరీ చేసిందంటూ ఆ పార్టీ నేతలు గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేశారు. కొన్ని దశాబ్దాలుగా తాము దాచుకున్న కార్యకర్తల డేటాను తెలంగాణ పోలీసులు, వైకాపా నేతలు కలసి కుట్రలు చేసి డేటా చౌర్యం చేశారని తెదేపా నేతలు ఆరోపించారు.దీనికి బాద్యులైన వారిని వెంటనే శిక్షించాలని ఎస్పీని కోరారు.