డ్రగ్స్ ..కలకలం!

కామారెడ్డిలో డ్రగ్స్ కలకలం రేపాయి. కోట్ల విలువైన డ్రగ్స్ లభ్యమవడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే రూ.2.50 కోట్ల విలువైన మత్తు పదార్థాలను గుజరాత్ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. గుజరాత్ నుంచి ఆల్పాజోలం అనే మత్తుమందును కొందరు హైదరాబాద్‌కు కారులో తరలిస్తుండగా అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. అయితే ఈ మత్తు మందు ఒక్క సరి వాడితే వాళ్లు త్వరగా బానిసలవుతారని, అంతేకాక నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందని అధికారులు తెలిపారు. ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్‌ చేసిన అధికారులు వారి దగ్గర నుంచి కారును స్వాధీనం చేసుకున్నారు.

leave a reply