ప్రభాస్‌ కేసుపై.. తెలంగాణ ప్రభుత్వంకు ఆదేశాలు..!

ప్రభాస్‌ గెస్ట్‌ హౌస్‌ సీజ్‌పై సినీ నటుడు ప్రభాస్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ చేసింది. శుక్రవారం హీరో ప్రభాస్‌ వేసిన పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేవలం సీజ్‌ మాత్రమే చేశామని, ఎలాంటి కూల్చివేతలు చేపట్టలేదని ప్రభుత్వం తరుపు న్యాయవాది తెలిపారు. దీనిపై వాదనలు విన్న కోర్టు ఈ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్‌ 31కి వాయిదా వేసింది.

హైదరాబాద్‌ రాయదుర్గంలోని పన్మక్తా గ్రామ రెవెన్యూ సర్వే నంబరు 46లో గల 84 ఎకరాల 30 గుంటల భూమి ప్రభుత్వానిదేనంటూ సుప్రీం కోర్టు తీర్పునివ్వడంతో.. శేరిలింగంపల్లి తహసీల్దార్‌ వాసుచంద్ర ఆ స్థలంలోని నిర్మాణాలు తొలగించి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలంలో ప్రభాస్‌ గెస్ట్‌ హాస్‌ ఉండటంతో దాన్నీ అధికారులు సీజ్‌ చేశారు. అయితే, తనకు ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా ఇల్లు సీజ్ చేయడంపై ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

leave a reply