జమ్ముకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల భౌతికకాయాలు ఢిల్లీ చేరుకున్నాయి.ఢిల్లీ లోని పాలెం విమానాశ్రయంలో అమర జవాన్లకు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్సింగ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్, నేవీ చీఫ్ సునీల్ లంబ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి రాజ్యవర్థన్సింగ్ రాఠోడ్,ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్,ఆర్మీ అధికారులూ మరియు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.అమర జవాన్ల అంత్యక్రియల్లో పాల్గొనాలని భాజపా పాలిత రాష్ట్రాల్లోని ఎంపీలు, మంత్రులకు ప్రధాని పిలుపునిచ్చారు.
ఢిల్లీ చేరుకున్న అమర జవాన్ల భౌతికకాయాలు… నివాళులర్పించిన ప్రముఖులు
Post navigation
Posted in: