వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కూడా నేనూ కూడా అంటూ సొషల్ మీడియాలోకి అడుగుపెట్టారు. ఈ రోజు ఆయన కొత్తగా ట్విట్టర్ అకౌంట్ను స్టార్ట్ చేసి.. మీతో నా అభిప్రాయాలు పంచుకునే అవకాశం రావడం నాకు ఆనందంగా ఉంది అంటూ తన మొదటి ట్వీట్ను చేశారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున బొత్స ట్విట్టర్ ఖాతను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రజలకు చేరువయ్యేందుకు ఇదో సులభమైన మార్గం అని అన్నారు. వివిధ సమస్యలపై ఇక్కడ చర్చించడం వల్ల మంచి పరిష్కారాలు దొరుకుతాయన్నారు. మీ ఆదరణ మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నా అని తెలిపారు.
నేనూ స్టార్ట్ చేశా..
Posted in: