‘జనసేన’ పార్టీ బలోపేతంపై సినీ హీరో పవన్ కళ్యాణ్ దృష్టిసారించారు. దీనికి సంబంధించిన ఒక ప్రకటనను విడుదల చేస్తూ అందులో పలు విషయాలు పేర్కొన్నారు. పార్టీ బలోపేతంపై తాము దృష్టి సారించినట్లు, తమ నాయకులకు పలు కీలక బాధ్యతలు ఇచ్చినట్లు ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు రేపు విజయవాడలో పర్యటించనున్న పవన్.. పార్టీ కో ఆర్డినేటర్లతో సమావేశం కానున్నారు. 100 రోజులకు పార్టీ ప్రణాళికను వారికి వివరించనున్నారు. ప్రణాళికపై పలు సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. పార్టీ కోసం కష్టపడాలి తప్పదు.. ఇప్పుడు కష్టపడితేనే ముందు ముందు విజయం సాధించడానికి తొడ్పడుతుందని ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు గుర్తుచేస్తున్నా అని అన్నారు.