సత్తా చాటి చూపుతాం..!

లోక్‌సభ ఎన్నికల్లో 16 సీట్లు టీఆర్‌ఎస్‌వేనని ఎంపీ కవిత అన్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ.. ఓటమికి ప్రతిపక్షాలు కుంటిసాకులు చెబుతున్నాయని అన్నారు. ముందు ఈవీఎంల ట్యాంపరింగ్ అన్న విపక్షాలు ఇప్పుడు చంద్రబాబును నిందిస్తున్నారని పేర్కొన్నారు.

మరో ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సమస్యలపై అనేక సార్లు కేంద్ర మంత్రుల్ని కలిశామని.. సీతారామ ప్రాజెక్టుకు అనుమతులపై కేంద్రం తాత్స్కారం చేస్తుందని ఎంపీ జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. నాలుగున్నరేళ్ల మోదీ పాలన డిజాస్టర్ అని, పార్లమెంట్‌లోనూ పని జరగడం లేదని వాపోయారు. ఇక ఎంపీ వినోద్ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని అన్నారు. తెలంగాణలో కూటమి కట్టకముందే కాంగ్రెస్ ఓడిపోయిందని పేర్కొన్నారు.

leave a reply