కుప్పకూలిన రెండు భారీ క్రేన్లు

కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టులో ప్రమాదం చోటు చేసుకుంది. భారీ ఓడల నుంచి సరకు కిందకు దించేందుకు ఉపయోగించే ఆఫ్‌షోర్‌ క్రేన్లు రెండు కుప్పకూలాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. 10 మందికి గాయాలయ్యాయి. శిథిలాల కింద మరికొంత మంది కార్మికులు చిక్కుకున్నారు. ఇటీవల సంభవించిన తుపాను కారణంగా దెబ్బతిన్న క్రేన్‌ను మరమ్మతు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. భారీ క్రేన్లు కుప్పకూలిపోవడంతో అక్కడి కార్మికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

leave a reply