తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కేసీఆర్ గురువారం రాజ్భవన్లో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మళ్లీ తన పాత ప్రభుత్వాన్ని కొత్త ఉత్సాహంతో ఏర్పాటు చేసుకున్నారు. రాజ్భవన్లోని దర్బార్ హాల్ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయనతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. అనుకున్న ముహుర్తానికే సరిగ్గా మధ్యాహ్నం 1.25గంటలకు కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ‘కేసీఆర్ అనేనేను.. ’ అంటూ తెలుగులో ప్రమాణం చేశారు. ఆయనతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మహమూద్ అలీ ఉర్దూలో ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేటీఆర్, హరీశ్రావుతో పాటు కేసీఆర్ కుటుంబ సభ్యులు, మహమూద్ అలీకుటుంబ సభ్యులు హాజరయ్యారు. నూతన ఎమ్మెల్యేలు, తెరాస ఎంపీలు, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
పాత ప్రభుత్వం.. కొత్త ఉత్సాహంతో..
Post navigation
Posted in: