సిరీస్ కోల్పోయిన అమ్మాయిలు!

న్యూజిలాండ్‌ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత మహిళల క్రికెట్‌ జట్టు.. అదే జోరును కొనసాగించలేకపోయింది. మొదటి టీ20లో  ఓటమిపాలైన భారత మహిళల జట్టు ఈ రోజు జరిగిన రెండో టీ 20లోను ఓడిపోయి సిరీస్ ను కోల్పోయింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-0 తో సిరీస్‌ను చేజార్చుకుంది. శుక్రవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో కివీస్‌ జట్టు భారత్‌పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి ముందు బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌ జట్టు భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్‌కు ఆరంభించిన భరత్ ఆదిలోనే తడబడింది. మూడో ఓవర్‌లోనే ఓపెనర్‌ ప్రియా పునియా ఔటయ్యింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జెమిమా రొడ్రిగస్‌.. ఓపెనర్‌ స్మృతి మంధాన వీరిద్దరూ కలిసి  ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. 72 పరుగులతో స్కోరు బోర్డును పరుగులు పెట్టింది. అయితే మంధాన ఔట్‌ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన వారెవరూ క్రీజులో నిబడలేకపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో భారత జట్టు 6 వికెట్లు నష్టపోయి 135 పరుగులు చేసింది.

ఆ తర్వాత లక్ష్య ఛేదనలో కివీస్‌ జట్టు మొదట్లో తడబడింది. ఓవైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్‌ సూజీ బేట్స్‌(62) నిలకడగా విజయం కివీస్ ను వరించింది. ఆఖరి  బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో కివీస్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 136 పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో మూడు ఇంకో మ్యాచ్ మిగిలిఉండగానే సిరీస్‌ను 2-0తో న్యూజిలాండ్‌ కైవసం చేసుకుంది.

leave a reply