`ఉత్తుత్తి స్టీల్‌ ప్లాంట్‌కు’ శంకుస్థాపన..!

ఏపీ సీఎం చంద్రబాబుపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఘాటైన విమర్శలు చేశారు. గురువారం పర్యటనలో భాగంగా కడప జిల్లా మైలవరం కంబాలదిన్నెలోని ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు  సీఎం చంద్రబాబు ఈరోజు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. కాగా.. రాష్ట్ర విభజన సమయంలో ఉక్కు కర్మాగారం నిర్మిస్తామని ఇచ్చిన హామీని కేంద్రం పక్కనపెట్టేయడంతో దీని నిర్మాణానికి చంద్రబాబు ముందుకొచ్చారు.

‘ఉత్తిత్తి స్టీల్ ప్లాంట్‌కు’ శంకుస్థాపన చేసి చంద్రబాబు గారు మరొక డ్రామా ఆడారని అన్నారు. రాయేగా పోయిందేముందని వేసేశారే తప్ప ఆ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుంది. ఓట్ల సమయం కాబట్టి ప్రజలను మభ్యపెట్టడానికే ఇటువంటి ఉత్తుత్తి పనులు చేస్తున్నారని ఆరోపించారు. అమలుకు నోచుకోని ‘చంద్రన్న రాళ్లు’ రాయలసీమలో చాలా వున్నాయి. అసలు గనుల వివరాలను అధ్యయనం చేయకుండా, పొందుపరచకుండా సీమ ప్రజలను మరొకసారి మోసం చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో పని తక్కువ.. ఆర్భాటం ఎక్కువ.. స్టీల్ ప్లాంట్ విషయంలో చెప్పేవన్నీ అబద్ధాలే. ఒక రాయి పడేసి రాయలసీమను ఉద్ధరిస్తున్నట్లు పెద్ద బిల్డ్ అప్ ఒకటి..’ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

leave a reply