మాతృమూర్తి.. ఆవేదన!

కాలంతో పాటు మనుషులు కూడా మారాలి అన్న విషయం కూడా తెలియని వాళ్ళు ఇంకా ఉన్నారు. దీనికి నిదర్శనమే ఒక కుటుంబంలో తల్లిని కోల్పోవలసి వచ్చింది. ప్రస్తుత కాలంలో ఆడపిల్లలు చురుగ్గా ఎదుగుతుంటే ఇంకా మగ బిడ్డ కావాలనే ఆలోచనలోనే ఉన్నారు.  మగబిడ్డ కావాలన్న వివక్ష ధోరణి కొన్ని కుటుంబాల్లో పోకపోవడం ఎంతో దురదృష్టకరం. ఇలాంటి ఓ కుటుంబ వైఖరికి మహారాష్ట్రలో ఓ తల్లి మరణించింది. వరుసగా ఏడుగురికి జన్మనిచ్చి, రెండుసార్లు గర్భవిచ్ఛితి కూడా జరిగిన ఆమెకు మరోసారి కాన్పు సమయంలో అధిక రక్తస్రావం అయింది.

ప్రాణాపాయం అని తెలిసి కూడా మగబిడ్డ కావాలన్న ఆ కుటుంబ ఒత్తిడి తట్టుకోలేక ఆ తల్లి పదోసారి గర్భం దాల్చాల్సి వచ్చింది. ఇప్పటికే ఏడుగురు ఆడపిల్లలకు జన్మను ఇవ్వడం వలన దారుణం జరిగిపోయింది. కుటుంబం కోరుకున్నట్లు మగబిడ్డ పుట్టినప్పటికీ ఆ తల్లి తన ప్రాణాలను కోల్పోయింది.  మాజల్‌గాన్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో మీరా ఎఖాండే (38) అనే మహిళ శనివారం మృతశిశువుకు జన్మనిచ్చి ప్రాణాలు విడిచింది.ఒక పాన్‌షాపు నిర్వహిస్తూ జీవనం గడుపుతున్న  మీరా ఇప్పటికే 9 సార్లు గర్భం దాల్చింది. ఏడుగురు ఆడపిల్లలు పుట్టగా తర్వాత వారిలో ఓ కుమార్తె కూడా చనిపోవడం జరిగింది.  

leave a reply