ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం… భారత జట్టు!

త్వరలో ఆస్ట్రేలియాతో స్వదేశంలో ద్వైపాక్షిక సిరీస్‌ ఆడబోయే టీంఇండియా జట్టును ఎంపిక చేశారు. ప్రధానంగా రెండు టీ20ల సిరీస్‌తో పాటు తొలి రెండు వన్డేలకు టీమిండియా జట్టును  ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ సెలక్టర్లు ఎంపిక చేశారు. విరాట్‌ కోహ్లి తిరిగి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనుండగా, రోహిత్‌ శర్మను వైస్‌ కెప్టెన్‌గా నియమించారు. ఈ నెల 24న విశాఖలో మొదటి టీ 20 తో సిరీస్ ప్రారంభంకానుంది.

ఈ సిరీస్‌కు రోహిత్‌ శర్మకు విశ్రాంతి ఇస్తారని తొలుత భావించారు. అయితే రెండు టీ20ల సిరీస్‌తో పాటు తొలి రెండు వన్డేలకు కూడా అతడిని ఎంపిక చేస్తూ చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. భారత ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ను తిరిగి జట్టులోకి  తీసుకున్నారు, పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ కూడా టీ20 జట్టులో స్థానం దక్కి్ంచుకున్నాడు. అటు విశ్రాంతితో జట్టుకు దూరమైన బుమ్రా కూడా తిరిగి జట్టులో స్థానం సంపాదించాడు.

టీ20 సిరీస్‌ భారత జట్టు: విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ( వైస్‌ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌, ఎంఎస్‌ ధోని, రిషభ్‌ పంత్‌, దినేశ్‌ కార్తీక్‌, హార్దిక్‌ పాండ్యా, కృనాల్ పాండ్యా, విజయ్‌ శంకర్‌, యజ్వేంద్ర చహల్‌, బూమ్రా, ఉమేశ్‌ యాదవ్‌, సిద్దార్థ్‌ కౌల్‌, మయాంక్‌ మార్కండే.

తొలి రెండు వన్డేలకు భారత జట్టు: విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, అంబటి రాయుడు, కేఎల్‌ రాహుల్‌,ఎంఎస్‌ ధోని, కేదర్‌ జాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, విజయ్‌ శంకర్‌, బూమ్రా, మహ్మద్‌ షమీ, యజ్వేంద్ర చహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, రిషభ్‌ పంత్‌, సిద్ధార్ద్‌ కౌల్‌.

leave a reply